Gold: చాక్లెట్ పౌడర్లో బంగారం పౌడర్.. ఎలా దొరికిపోయాడంటే..!
బంగారం స్మగ్లర్లు చాలా తెలివి మీరిపోయారు. రకాలక పద్ధుతుల్లో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా చాక్లెట్ పౌడర్ రూపంలో రవాణా చేస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. తమిళనాడు తిరుచిరాపల్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చాక్లెట్ పౌడర్ రూపంలో ఉన్న 211 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.21.55 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.

175 గ్రాముల బంగారు గొలుసులు
ఆదివారం ఎయిరిండియా విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. అయితే అతని నుంచి చాక్లెట్ పౌడర్ లో బంగారం పౌడర్ ను కలిపి మూడు చాక్లెట్ పౌడర్ డబ్బాలను అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుడి చెక్ ఇన్ బ్యాగేజీ నుంచి 175 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు.
సాక్సుల్లో బంగారం
కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సాక్సుల్లో బంగారం దాచుకుని విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. అతను అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీలు చేశారు.అతని వద్ద బంగారం దొరకలేదు. అయితే అతని షూ విప్పమని అడగ్గా కాస్త ఆలస్యం చేయడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సాక్సులను చెక్ చేయగా అతన వద్ద పుత్తడి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని నుంచి 957 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 46లక్షల 53 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

షర్ట్ లో 804 గ్రాముల బంగారం
అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలోనే హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 800 గ్రాములకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ గౌస్ ఖాన్ అనే వ్యక్తి షర్ట్ లో 804 గ్రాముల బంగారం దాచి కుట్టేయించాడు. అదే షర్ట్ ధరించి దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగాడు. అధికారులు అతన్ని చూసి అనిమానించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బంగారం పట్టుబడింది.

కత్తెరతో
షర్ట్ కొంచె డిఫరెంట్ గా కనిపించడంతో షర్ట్ ను కత్తెరతో కట్ చేశారు. దీంతో అందులోని బంగారం బయటపడింది.విమానం దిగిన తర్వాత తనిఖీలు చేసినా నిందితుడి వద్ద ఏమీ దొరకలేదని అధికారులు తెలిపారు. కానీ అతను అనుమానాస్పందంగా కనిపించినట్లు చెప్పారు.విదేశాల నుంచి భారత్ కొంత మొత్తం వరకే బంగారం తీసుకురావొచ్చు. భారీ మొత్తంలో బంగారం తీసుకురావాలంటే ట్యాక్స్ కట్టి తీసుకురావాల్సి ఉంటుంది.

ట్యాక్స్
దుబాయ్ వంటి విదేశీ మార్కెట్ల నుంచి వ్యక్తిగతంగా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ట్యాక్స్ పరిశీలన లేకుండా బంగారాన్ని తీసుకొచ్చే అనుమతి ఉంటుంది. బంగారం లేదా నగల రూపంలో మాత్రమే ఈ బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాల్సి ఉంటుందట. నగల రూపంలో మినహా ఇతర ఏవిధమైన రూపాల్లోనూ బంగారం లేదా వెండిని భారత్లోకి దిగుమతి చేయడానికి అనుమతి లేదు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications