cyclone bulbul:భారీ వర్షాలు, ఉరుముల బీభత్సం, బెంగాల్లో ఒకరి మృతి
బుల్ బుల్ తుపాన్ బెంగాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ రాత్రి సందర్బన్ డెల్టా నుంచి.. భారత్ బంగ్లాదేశ్ మీదుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈదురుగాలతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. తుపాన్ ప్రభావంతో ఒకరు మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
తుపాన్ ప్రభావంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులను మరో రెండురోజులు పొడిగిస్తున్నట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఇప్పటికే లక్ష 20 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. తీరప్రాంతాల్లో భీతవాహ పరిస్థితి నెలకొందని ఆమె వెల్లడించారు. తుపాన్ తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ విభాగం నిన్ననే ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.

శని, ఆది రెండురోజులకు ఆరెంజ్ అలర్ట్ వర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపరా, జగత్ సింగ్ పూర్ వద్ద భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని.. 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications