ఒడిశాలో హై అలర్ట్.. పూరీ విడిచి వెళ్లాలని టూరిస్టులకు ఆదేశం..
భువనేశ్వర్ : శరవేగంగా దూసుకొస్తున్న ఫొని తుఫాను ఒడిశా వాసులను వణికిస్తోంది. అతి తీవ్ర తుఫానుగా మారిన ఫొని గంటకు 200కి.మీ వేగంతో శుక్రవారం మధ్యాహ్నం గోపాల్పూర్ - చాంద్బాలీ దగ్గర తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పెనుగాలులు, అతి భారీ వర్షాలతో తుఫాను బీభత్సం సృష్టించనున్న నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. టూరిస్టులందరూ పూరీ విడిచి వెళ్లాలని ఆదేశించారు.
శుక్రవారం ఫొని తీరాన్ని తాకనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు గురువారం సాయంత్రానికల్లా నగరం విడిచి వెళ్లాలని సూచించింది. ఒడిశా తీరప్రాంతంలో గంటకు 205 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశముండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. తుఫాను బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటుచేసింది. సహాయక కార్యక్రమాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

గతేడాది ఉత్తరాంధ్ర, ఒడిశాపై విరుచుకుపడిన తిత్లీ తుఫానును మించి ఫొని బీభత్సం సృష్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అప్పట్లో ఈ తుఫాను కారణంగా 60మందికిపైగా మృత్యువాతపడ్డారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications