వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశాలో హై అలర్ట్.. పూరీ విడిచి వెళ్లాలని టూరిస్టులకు ఆదేశం..

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ : శరవేగంగా దూసుకొస్తున్న ఫొని తుఫాను ఒడిశా వాసులను వణికిస్తోంది. అతి తీవ్ర తుఫానుగా మారిన ఫొని గంటకు 200కి.మీ వేగంతో శుక్రవారం మధ్యాహ్నం గోపాల్‌పూర్ - చాంద్‌బాలీ దగ్గర తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పెనుగాలులు, అతి భారీ వర్షాలతో తుఫాను బీభత్సం సృష్టించనున్న నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. టూరిస్టులందరూ పూరీ విడిచి వెళ్లాలని ఆదేశించారు.

జలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేతజలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేత

శుక్రవారం ఫొని తీరాన్ని తాకనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు గురువారం సాయంత్రానికల్లా నగరం విడిచి వెళ్లాలని సూచించింది. ఒడిశా తీరప్రాంతంలో గంటకు 205 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశముండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. తుఫాను బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటుచేసింది. సహాయక కార్యక్రమాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

Cyclone Fani nears Odisha, tourists told to leave Puri

గతేడాది ఉత్తరాంధ్ర, ఒడిశాపై విరుచుకుపడిన తిత్లీ తుఫానును మించి ఫొని బీభత్సం సృష్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అప్పట్లో ఈ తుఫాను కారణంగా 60మందికిపైగా మృత్యువాతపడ్డారు.

English summary
Authorities in Odisha, which will suffer the maximum impact of Cyclone Fani, have asked tourists in Puri to leave the temple town as they requested for additional teams and helicopters to assist them in evacuating people who will be affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X