మూడు రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరికలు, 48 గంటల్లో చెన్నై తీరాన్ని తాకనున్న తుఫాన్
తమిళనాడు, పాండిచ్చేరి,ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు తుఫాన్ ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో తుపాన్ ప్రభావం కన్పించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
న్యూడిల్లీ :తమిళనాడు, పాండిచ్చేరి,ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు తుఫాన్ ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో తుపాన్ ప్రభావం కన్పించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
చెన్నైకు తూర్పు దక్షిణ భాగంలోని 1070 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. పాండిచ్చేరిలోని తూర్పు ఈశాన్య, శ్రీలంకలోని త్రినాకోమలై ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరంలో తుపాన్ ఉన్నట్టు అధికారులు చెప్పారు.
ఆగ్నేయ బంగాళకాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరింత బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖాధికారులు చెప్పారు. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదికారుల ప్రకటించారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.

వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెప్పారు. డిసెంబర్ రెండవ తేదని కడలూరు సమీపంలోని వేదారణ్యం,చెన్నై మద్య తుఫాన్ తీరం దాటే అవకాశం ుందని వాతావరణ శాఖాధికారులు అంచనావేస్తున్నారు.
నాగపట్నం, కడలూరు, కారైకల్ ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ రెండవ తేదిన పాండిచ్చేరి తీరానికి తుఫాన్ చేరే అవకాశం ఉందని దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు 48 గంటల తర్వాత తుఫాన్ చెన్నై తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడ తుపాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు అంచ,నా వేస్తున్నారు. మత్య్సకారులు వేటకు వెళ్ళకూడదని అధికారులు కోరుతున్నారు. తుఫాన్ ప్రభావంతో మూడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.రెండు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురిసినా, ఎపిలో రెండు రాస్ట్రాల్లోనే దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications