మరో కీలక పదవి: ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా పురంధేశ్వరి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పురందేశ్వరికి కీలక పదవి దక్కింది. కేంద్రం పురందేశ్వరిని ఎయిర్ ఇండియా బోర్డ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించింది. కేబినెట్ కమిటీ నిర్ణయం మేరకు డైరెక్టర్గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నాన్ అఫిషియల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాలో.. పురందేశ్వరి మూడేళ్ల పాటూ పనిచేయనున్నారు. ఎయిర్ ఇండియా పదవిలో నియమించినందుకు పురేందేశ్వరి కేంద్రానికి, బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
దగ్గుబాటి పురందేశ్వరి యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో బీజేపీలో చేరి.. ఏపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.
ఆ తర్వాత ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పించి.. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించారు. ఇప్పుడు ఎయిర్ ఇండియో డైరెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు. పురందేశ్వరికి పదవి రావడంపై ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు తెలిపారు.