అసలేం జరిగింది?: గుజరాత్లో దళితుల రగడ, హెడ్ కానిస్టేబుల్ మృతి
రాజ్కోట్: గుజరాత్ రాష్ట్రంలో దళితుల ఆందోళన ఉధృతమైంది. గిర్-సోమనాథ్ జిల్లాలోని ఉనాలో చనిపోయిన ఆవు చర్మం వొలిచారంటూ దళితులపై జరిగిన దాడి ఘటన మొత్తం గుజరాత్లో మొత్తం మంటలు రేపుతోంది. ఈ దాడిలో దెబ్బలు తిన్న ఏడుగురు యవకులు ఆత్మహత్యాయత్నం చేయడంతో వారికి మద్దతుగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి.
ఇందులో భాగంగా గుజరాత్ దళిత ఆందోళన మంగళవారం అహ్మదాబాద్ సహా పలు ఇతర ప్రాంతాలకు విస్తరించింది. మంగళవారం అమ్రేలి పట్టణంలో జరిగిన ఘర్షణల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఘర్షణల్లో భాగంగా రాళ్ల దెబ్బలకు గాయపడ్డ ఓ కానిస్టేబుల్ పంకజ్ అమ్రేలి రాజ్కోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ హింసాత్మక ఘటనలో పదిమంది పోలీసులతో పాటు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు. మరోవైపు రాజ్కోట్ జిల్లాలోని గోందల్, జాంకండ్దోర్నా గ్రామాల్లో ఏడుగురు యువకులు సోమవారం విషం తాగి ఆత్మాహుతికి యత్నించారు. దీంతో గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి.
అల్లర్లు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్కు పాకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున దళిత యువకులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో గల జునాగఢ్, జాంనగర్, రాజ్కోట్, అమ్రేలి జిల్లాలలో మంగళవారం పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి పట్టణ రహదారులపై చచ్చిన గోవులను పడేసి దళితులు నిరసన తెలిపారు. వాటిని తీసివేయడానికి పోలీసులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అంతక ముందు ఆందోళనకారులు అనేకచోట్ల బస్సులపై రాళ్లదాడి జరిపారు.
అసలేం జరిగింది?:
గత వారం రాజ్కోట్ జిల్లా యునా, జునాగఢ్ జిల్లా బాత్వా గ్రామాలకు చెందిన ఏడుగురు దళితులపై గో పర్యవేక్షణా కార్యకర్తలు దాడిచేశారు. గోవులను చంపి, చర్మం వొలుస్తున్నారంటూ వాళ్లని తాళ్లతో కట్టేశారు. తాము చచ్చిన గోవుల చర్మం తీస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా కొట్టారు. దీంతో మనస్థాపం చెందిన ఏడుగురు యువకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications