దారుణం: దళిత యువకుడిపై ప్రతాపం, యూరిన్ తాగాలని పీఎస్లో హరాస్..
అణగారిన వర్గాలు అంటే సమాజంలో చిన్న చూపే.. ఇక పోలీసుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బలమైన సామాజిక వర్గం వారు ఏదీ చెబితే అదే జరుగుతుంది. కర్ణాటక చిక్ మంగళూర్ జిల్లాలో అలాంటి ఘటన జరిగింది. ఓ యువకుడిపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.

గోనిబీడు పోలీస్ స్టేషన్ పరిధిలో పునీత్ అనే యువకుడు ఉంటున్నాడు. అతను ఓ మహిళతో తరచుగా మాట్లాడుతున్నాడు అనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది పోలీసులు పీఎస్కు తీసుకొచ్చారు. నరకం అంటే ఏంటో అతనికి చూపించారు. కాళ్లు చేతులు కట్టేసి కొట్టారు. దాహం వేస్తుందని అడిగిన పాపానికి యూరిన్ పోశారు. నేలపై ఉన్న అదీ నాకాలని బెదిరించారు. అలా చేయకుంటే వదిలిపెట్టమని హెచ్చరించారు.
Recommended Video
తనను కులం పేరుతో కూడా దూషించారని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఈ ఘటన జరగగా.. అతను డీజీపీకి ఫిర్యాదు చేశాడు.ఘటనపై చిక్ మంగళూర్ డీఎస్పీ స్పందించారు. దర్యాప్తు జరుగుతుందని.. ఎస్సైని ట్రాన్స్ ఫర్ చేశామని వివరించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. సదరు ఖాకీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications