కూతురు కళ్ళముందే తల్లి ఎలా చనిపోయిదంటే
అహ్మదాబాద్ : తల్లి కూతుళ్ళు కలిసి ప్రయాణిస్తున్నారు. అప్పటివరకు కబుర్లు చెప్పుకొంటూ వెళ్తోన్న వారిలో ఒకరు హఠాత్తుగా మృత్యు ఒడిలోకి వెళ్ళారు. రెప్పపాటులో జరిగిన ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు దాటుతున్న వారిని ప్రమాదం కుటుంబంలో కన్నీరు మిగిల్చింది.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మాదాబాద్ లో ఈ ఘటన జరిగింది అహ్మాదాబాద్ లో కుమార్తెతో కలిసి తల్లి రోడ్డు దాటుతుండగా చోటుచేసుకొన్న ప్రమాదం కూతురును విషాదంలో ముంచింది. కూతురు ముందే తల్లి ప్రాణాలు వదిలింది.ఈ ప్రమాదం నుండి కూతురు తృటిలో తప్పించుకొంది.
అహ్మదాబాద్ లో రోడ్డు దాటుతున్న తల్ల కూతుళ్ళను అతి వేగంగా వస్తోన్న కారు డీ కొట్టింది ఈ ప్రమాదంలో తల్లి కూతుళ్ళు రోడ్డుపైనే పడిపోయారు. ఈ ప్రమాదం లో తలకు తీవ్ర గాయాలతో తల్లి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో కూతరు బయటపడింది.
తలకు గాయాలతో ఉన్న తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు కూతురు ప్రయత్నించింది. అయితే కొన ఊపిరితో ఉన్న తల్లి తీవ్ర గాయాల కారణంగా కణాల్లో మరణించింది. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మాత్రం కారు ఆపకుండా వెళ్ళిపోయాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ ప్రమాద దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.