దావూద్పై పార్లమెంట్లో ప్రకటన: భారత్కు రప్పిస్తామన్న హోం మంత్రి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను త్వరలోనే భారత్కు రప్పిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం లోక్సభలో ప్రకటించారు. దావూద్ పాకిస్ధాన్లోనే ఉన్నాడని తమ వద్ద సమాచారం ఉందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
తొందరలోనే ఈ వివాదానికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. దావూద్కు సంబంధించి పాకిస్ధాన్ వద్ద అన్ని వివరాలున్నాయని ఆయన చెప్పారు. దావూద్ను పట్టుకోవడంలో పాకిస్ధాన్ ప్రభుత్వం విఫలమవుతోందని ఈ మేరకు రాజ్నాథ్ సోమవారం లోక్సభలో ఓ ప్రకటన చేశారు.

అయితే ఎలాగైనా సరే దావూద్ ఇబ్రహీంని భారత్కు రప్పించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గత వారంలో లోక్సభలో 'దావూద్ ఎక్కడున్నాడో ప్రభుత్వానికి ఇంతవరకూ తెలియదు. అతని ఆచూకీ తెలుసుకున్న తర్వాత అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది' అన్న హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి ప్రకటనతో లోక్సభలో దుమారం చెలరేగింది.
దీంతో ఈ రోజు రాజ్నాథ్ లోక్సభలో ఈ సోమవారం నిత్యానంద్ రాయ్ అనే సభ్యుడికి ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దావూద్ పాక్లో ఆ దేశ భద్రతా బలగాల అండతో తలదాచుకుంటున్నాడని భారత ప్రభుత్వం పలు వివరాలను పాక్కు అందించడం, అతన్ని తమకు అప్పగించాలని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దావూద్ ఇబ్రహీంపై రెడ్ కార్నర్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నోటీసులు కూడా ఉన్నాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications