సాహస అవార్డు అందుకున్న మర్నాడే టెర్రరిస్టుల చేతిలో హతం
శ్రీనగర్: వీరోచిత పోరాటం చేసిన సైనికాధికారి ఒకరు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. గణతంత్ర వేడుకల్లో సోమవారంనాడు సాహస పురస్కారం అందుకున్న మర్నాడే ఉగ్రవాదుల దాడిలో వీరమరణం చెందారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో మంగళవారంనాడు జరిగిన ఎదురు కాల్పుల్లో 42వ రాష్ట్రీయ రైఫిల్కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ మునీంద్ర నాథ్ రాయ్ మరణించారు.
త్రాల్ ప్రాంతంలోని మిందోరాలో జరిగిన ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. మృతులను ఆదిల్ ఖాన్, షిరాజ్ దార్లుగా గుర్తించారు.

ఎదురు కాల్పుల్లో బుల్లెట్ గాయాలు కావడంతో తీవ్రంగా గాయపడిన రాయ్ తుది శ్వాస విడిచారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారంనాడు ఆయన యుద్ధ్ సేవా పతకం అందుకున్నారు. జవాను మనీష్ కుమార్ ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డారు.
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల జాడపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మరణించిన ఉగ్రవాది అదిల్ ఖాన్ మిందోరా ప్రాంతానికి చెందినవాడు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications