కేజ్రీవి తప్పుడు ఆరోపణలే: కోర్టులో అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోపాటు మరో ఐదుగురు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. వారిపై జైట్లీ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన మంగళవారం ఢిల్లీలో కోర్టుకు హాజరయ్యారు.
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సంజయ్ కనగ్వాల్ ఎదుట జైట్లీ స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజ్రీవాల్, మరో ఐదుగురు తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఈ ఆరోపణలు పరువునష్టం దావా వెయ్యదగినంత తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. కాగా, జైట్లీ కోర్టుకు హాజరైన సమయంలో లోపలికి మీడియాని కూడా అనుమతించలేదు. కేవలం లాయర్లను మాత్రమే కోర్టులోకి అనుమతించారు.

కాగా, డీడీసీఏకి గతంలో జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కేజ్రీవాల్ సహా ఆప్నేతలు గతంలో విమర్శించిన విషయం తెలిసిందే.
అక్కడ జరిగిన అవినీతితో జైట్లీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు చేసిన వారిపై జైట్లీ పరువునష్టం దావా వేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications