వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవి తప్పుడు ఆరోపణలే: కోర్టులో అరుణ్ జైట్లీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మరో ఐదుగురు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వారిపై జైట్లీ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన మంగళవారం ఢిల్లీలో కోర్టుకు హాజరయ్యారు.

మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సంజయ్‌ కనగ్వాల్‌ ఎదుట జైట్లీ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌, మరో ఐదుగురు తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఈ ఆరోపణలు పరువునష్టం దావా వెయ్యదగినంత తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. కాగా, జైట్లీ కోర్టుకు హాజరైన సమయంలో లోపలికి మీడియాని కూడా అనుమతించలేదు. కేవలం లాయర్లను మాత్రమే కోర్టులోకి అనుమతించారు.

DDCA scam: Kejriwal made false statements against me, Jaitley tells court

కాగా, డీడీసీఏకి గతంలో జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కేజ్రీవాల్‌ సహా ఆప్‌నేతలు గతంలో విమర్శించిన విషయం తెలిసిందే.

అక్కడ జరిగిన అవినీతితో జైట్లీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు చేసిన వారిపై జైట్లీ పరువునష్టం దావా వేశారు.

English summary
Union Finance Minister Arun Jaitley told the Patiala House Court in New Delhi on Tuesday that Delhi Chief Minister and five others made the statements to deflect attention from the ongoing CBI investigation "against a particular person who is working with Kejriwal."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X