Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇటుకబట్టీ పేలుడు: 9కి మృతులసంఖ్య: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్గ్రేషియా

బీహార్ రాష్ట్రంలో ఇటుక బట్టి లో చిమ్నీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కొందరు సంఘటన స్థలంలోనే మృతిచెందగా, మరికొందరు ఆసుపత్రికి తరలించిన తరువాత చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటుక బట్టి పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ

మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ

ఈ ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడి వారికి 50 వేల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థిస్తున్నట్లు గా పేర్కొన్నారు.

ఇటుక బట్టీలో చిమ్నీ పేలుడు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఇటుక బట్టీలో చిమ్నీ పేలుడు.. పెరుగుతున్న మృతుల సంఖ్య


కాగామోతిహారి లోని రామ్ గర్వా ప్రాంతంలోఉన్న ఇటుక బట్టీలో చోటు చేసుకున్న ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో అందరినీ షాక్ కి గురి చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో, చిమ్నీ లో పేలుడు సంభవించి తొమ్మిది మంది మృత్యువాత పడటంతో పాటు, అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు.మృతులలో ఇటుక బట్టి యజమాని మహమ్మద్ఇష్రార్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్


ఇటుక బట్టీల పేలుడు ఘటన సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్,పోలీసు సూపరిండెంట్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు.రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.దాదాపు 20 మందికి గాయాలు కాగా, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఘటనా స్థలంలో అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకితెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం నితీష్ కుమార్ .. దిగ్భ్రాంతి

ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం నితీష్ కుమార్ .. దిగ్భ్రాంతి

ఇక బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఇటుక బట్టీ ప్రమాద ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ఇటుక బట్టీ ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి చెందటంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది.గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఏ ఎస్ పి రక్సుల్ పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+