ఢిల్లీలో పట్టపగలే దోపిడీ: సెక్యూరిటీ గార్డ్ హత్య, 1.5కోట్లు అపహరణ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పట్టపగలే దొంగలు దోపిడీకి తెగబడ్డారు. నగదును తీసుకెళుతున్న వ్యాన్ను అడ్డగించిన ఇద్దరు దొంగలు సెక్యూరిటీ గార్డును హత్య చేసి రూ. 1.5 కోట్ల కోట్లను అపహరించారు. ఈ ఘటన ఎప్పుడూ రద్దీగా ఉండే కమలానగర్ మార్కెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
కమలానగర్ సమీపంలోని బంగ్లారోడ్లోని ఏటిఎం కేంద్రంలో డబ్బులు వేసేందుకు వచ్చిన నగదు వ్యాన్ను శనివారం ఉదయం 11 ప్రాంతంలో దుండుగులు దోచుకున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును హత్య చేసి పరారయ్యారు.
ఈ ఘటనపై జాయింట్ కమిషన్ ఆఫ్ పోలీస్ సందీప్ గోయల్ మాట్లాడుతూ.. కమలానగర్, రూప్నగర్ ప్రాంతాల్లోని ప్రైవేటు బ్యాంకులకు చెందిన రెండు ఏటిఎంలలో నగదు వేసేందుకు నగదు వ్యాన్ వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.

‘ఏటిఎం యంత్రంలో సిబ్బంది డబ్బులు వేస్తున్న సమయంలో దుండగులు ఓ సెక్యూరిటీ గార్డ్ వ్యానుకు కాపలా కాస్తున్నాడు. ఆ సమయంలోనే బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు సెక్యూరిటీ గార్డు తలపై రెండు సార్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత వ్యానులోని రూ. 1.5కోట్ల నగదు కలిగి ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు' అని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
ఘటన స్థలంలో ఉన్న ప్రత్యక్షసాక్షులు వెంటనే తమకు ఫోన్ చేసి విషయం చెప్పారని ఆయన తెలిపారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, తీవ్ర గాయాలతో పడివున్న సెక్యూరిటీ గార్డును ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
అయితే మార్గమధ్యలోనే సెక్యూరిటీ గార్డు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు. నిందితులపై దోపిడీ, హత్యా నేరాల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సిసి కెమెరా ఫుటేజీ పరిశీలించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications