Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వార్నీ.. ఇదేం పని? ఆ గుహ నిండా ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లే!

ఢిల్లీలో మోతీభాగ్‌లో ఓ ఆరుగురు దొంగలు తాము దొంగిలించిన వస్తువుల్ని అక్కడికి సమీపంలో సుమారు 50 మీటర్ల లోతున ఉండే ఓ గుహలో భద్రపరుస్తున్నారు.

న్యూఢిల్లీ: దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారించడంతో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఒకటి.. రెండు కాదు.. గుట్టలు గుట్టలుగా ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లు బయటపడ్డాయి.

ఢిల్లీలోని మోతీభాగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనుమానితులుగా భావిస్తున్న ఓ ఆరుగురు వ్యక్తులు.. తాము దొంగిలించిన వస్తువుల్ని అక్కడికి సమీపాన సుమారు 50 మీటర్ల లోతున ఉండే ఓ గుహలో భద్రపరుస్తున్నారు.

Delhi: Cave used by thieves to hide laptops, TVs, mobiles found in Moti Bagh

పోలీసుల నుంచి తప్పించుకునేందకు కూడా ఈ దొంగలు గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేస్తున్నారు. ఈ గుహ ప్రవేశ ద్వారం చాలా చిన్నదిగా ఉండటమేకాక ఇది జనావాసానికి దూరంగా ఉండటంతో ఎవరికీ దీని గురించి అనుమానం రాలేదు.

అయితే బుధవారం వీరిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా ఈ నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. గుహలో ఓ టార్చిలైటుతో పాటు ఖాళీ బీరు సీసాలు, ఎవరైనా వెంబడిస్తే తప్పించుకోవడానికి అనువైన పరికాలు ఉన్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+