వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్నీ.. ఇదేం పని? ఆ గుహ నిండా ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లే!

ఢిల్లీలో మోతీభాగ్‌లో ఓ ఆరుగురు దొంగలు తాము దొంగిలించిన వస్తువుల్ని అక్కడికి సమీపంలో సుమారు 50 మీటర్ల లోతున ఉండే ఓ గుహలో భద్రపరుస్తున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారించడంతో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఒకటి.. రెండు కాదు.. గుట్టలు గుట్టలుగా ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లు బయటపడ్డాయి.

ఢిల్లీలోని మోతీభాగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనుమానితులుగా భావిస్తున్న ఓ ఆరుగురు వ్యక్తులు.. తాము దొంగిలించిన వస్తువుల్ని అక్కడికి సమీపాన సుమారు 50 మీటర్ల లోతున ఉండే ఓ గుహలో భద్రపరుస్తున్నారు.

Delhi: Cave used by thieves to hide laptops, TVs, mobiles found in Moti Bagh

పోలీసుల నుంచి తప్పించుకునేందకు కూడా ఈ దొంగలు గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేస్తున్నారు. ఈ గుహ ప్రవేశ ద్వారం చాలా చిన్నదిగా ఉండటమేకాక ఇది జనావాసానికి దూరంగా ఉండటంతో ఎవరికీ దీని గురించి అనుమానం రాలేదు.

అయితే బుధవారం వీరిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా ఈ నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. గుహలో ఓ టార్చిలైటుతో పాటు ఖాళీ బీరు సీసాలు, ఎవరైనా వెంబడిస్తే తప్పించుకోవడానికి అనువైన పరికాలు ఉన్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

English summary
New Delhi: A 50 metre deep cave used by criminals to hide stolen goods and conceal themselves from the police has been discovered in south Delhi’s Moti Bagh area, police said on Friday.The cave, located in a hilly area near Smriti Vatika Park in Moti Bagh Part 1, has two narrow entrances. But the inside, from where the police recovered laptops, mobile phones, television sets and expensive watches, is spacious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X