జంతర్ మంతర్లో మహిళా రెజ్లర్లతో కేజ్రివాల్ భేటీ-కేంద్రానికి కీలక విజ్ఞప్తి...

రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల నుంచి తమను కాపాడాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ లో వారం రోజులుగా నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్లకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా ఇవాళ జంతర్ మంతర్ కు వెళ్లి మహిళా రెజ్లర్లకు మరోసారి సంఘీభావం ప్రకటించారు. వారితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లోని రెజ్లర్ల నిరసన తెలుపుతున్న ప్రదేశంలో ఢిల్లీ పోలీసులు విద్యుత్, రేషన్ సరఫరాలను తగ్గించారని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా మరోసారి ఆరోపించారు. మరో రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా అవసరాలు లేకపోవడం, దోమల బెడద కారణంగా తనకు జ్వరం వచ్చిందని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తమకు ఆహారం, నీరు అనుమతించడం లేదన్నారు.

 kejiriyawal

ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసు పంపడంతో సమస్య ప్రారంభమైందని వారు ఆరోపిస్తున్నారు. నిరసనలు చేయాలనుకుంటే రోడ్డుపై పడుకోండి అని పోలీసులు చెప్పారని వారు తెలిపారు. సుప్రీం ఉత్తర్వుల తర్వాత వారిపై ఒత్తిడి పెరిగిందని, ఇప్పటివరకూ ఇలాంటి సమస్య లేదన్నారు.

పోలీసులు నిరసన ప్రదేశానికి బారికేడ్లు వేసి, వారికి సరఫరా చేయడానికి కేటాయించిన వ్యక్తులను కొట్టారని కూడా పునియా ఆరోపించారు. న్యాయం జరిగే వరకు, పోలీసు యంత్రాంగం మమ్మల్ని ఎంత హింసించినా నిరసన కొనసాగిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లతో సమావేశమైన తర్వాత కేజ్రివాల్... కేంద్రం జంతర్ మంతర్ లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+