Delhi CM: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. 15 మంది ఎమ్మెల్యేలతో జాబితా సిద్ధం!
Delhi CM: 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాల్లో బీజేపీ గెలవగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలలో విజయం సాధించింది.ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలను కమలం పార్టీ మొదలుపెట్టింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలిసింది. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 19 లేదా 20న జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభా పక్ష సమావేశం ఫిబ్రవరి 17 లేదా 18న జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ముగించికుని ఇవాళ లేదా రేపు ఉదయానికి ప్రధాని ఢిల్లీకి రానున్నారు. ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ వచ్చిన వెంటనే ప్రధానితో అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో చర్చలు జరిపి ఈ నెల 17, 18 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. 19 లేదా 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ పదవులకు ఎంపిక చేస్తారు.

ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో సహా ఆ పార్టీ కీలక నాయకులు పరాజయం పాలయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ప్రభుత్వ అధిపతిని నిర్ణయించడానికి ఉన్నత స్థాయి సమావేశాలను ప్రారంభించింది. ఐదుగురు నాయకులు కీలక పోటీదారులుగా ఉద్భవించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ.. ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడేవారి జాబితాలో ముందున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేసిన సీనియర్ బీజేపీ నేత విజయేందర్ గుప్తా, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కీలక బ్రాహ్మణ నేత సతీష్ ఉపాధ్యాయ్, కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆశిష్ సూద్, వైశ్య సమాజానికి చెందిన ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ ఇతర పోటీదారులుగా ఉన్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications