వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

40ఏళ్ల తర్వాత మాజీ రైల్వే మంత్రి హత్యకేసులో దోషులును గుర్తించిన ఢిల్లీ కోర్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Delhi Court Convicts 4 for Murder of Ex-Railway Minister LN Mishra
న్యూఢిల్లీ: మాజీ రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రా హత్యకేసుకు సంబంధించి ఢిల్లీ కోర్టు సోమవారం నలుగురిని దోషులుగా గుర్తించింది. బీహార్‌లో 40 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ఈ కేసు విచారణ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

ఈ కేసులో నలుగురిని దోషులుగా పేర్కొన్న ఢిల్లీ కోర్టు డిసెంబర్ 15న శిక్షను ఖరారు చేయనుంది. 1975 జనవరి 2న సమస్థిపూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి మిశ్రా హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో తీవ్ర గాయాలతో మంత్రి మరణించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సుదీర్ఘ విచారణ నిర్వహించారు. ఈ సమయంలో 161 ప్రాసిక్యూషన్ సాక్షులు, మరో 40 మంది డిఫెన్స్ సాక్షులను విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నన్యాయవాది రంజన్ ద్వివేది వయసు అప్పట్లో 24 ఏళ్లు. ఈయనతో పాటు మరో నలుగురుని దోషులుగా ప్రకటించింది.

ఈ నలుగురిలో ఒకరు మరణించగా మిగిలిన ముగ్గురు సంతోషానంద అవధూత, సుదేవానంద అవధూత, గోపాల్‌జీ‌లుగా న్యాయస్ధానం పేర్కొంది. ఈ మర్డర్ కేసులో ఇప్పటికే నిందితులు అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టుని ఆశ్రయించగా తిరస్కరించింది.

పాట్నాలోని సీబీఐ కోర్టులో నవంబర్ 1, 1977న ఛార్జ్‌షీట్ నమోదైంది. అప్పటి అటార్నీ జనరల్ కోరిక మేరకు ఈ కేసును 1979లో ఢిల్లీకి మార్చారు.

English summary
District Judge Vinod Goel convicted four followers of the Hindu sect Anand Marg - Gopalji, Ranjan Dwivedi, Santoshanand Avadhuta and Sudevananda Avadhuta - for the bomb blast that took Mishra's life 39 years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X