40ఏళ్ల తర్వాత మాజీ రైల్వే మంత్రి హత్యకేసులో దోషులును గుర్తించిన ఢిల్లీ కోర్టు
ఈ కేసులో నలుగురిని దోషులుగా పేర్కొన్న ఢిల్లీ కోర్టు డిసెంబర్ 15న శిక్షను ఖరారు చేయనుంది. 1975 జనవరి 2న సమస్థిపూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి మిశ్రా హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో తీవ్ర గాయాలతో మంత్రి మరణించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సుదీర్ఘ విచారణ నిర్వహించారు. ఈ సమయంలో 161 ప్రాసిక్యూషన్ సాక్షులు, మరో 40 మంది డిఫెన్స్ సాక్షులను విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నన్యాయవాది రంజన్ ద్వివేది వయసు అప్పట్లో 24 ఏళ్లు. ఈయనతో పాటు మరో నలుగురుని దోషులుగా ప్రకటించింది.
ఈ నలుగురిలో ఒకరు మరణించగా మిగిలిన ముగ్గురు సంతోషానంద అవధూత, సుదేవానంద అవధూత, గోపాల్జీలుగా న్యాయస్ధానం పేర్కొంది. ఈ మర్డర్ కేసులో ఇప్పటికే నిందితులు అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టుని ఆశ్రయించగా తిరస్కరించింది.
పాట్నాలోని సీబీఐ కోర్టులో నవంబర్ 1, 1977న ఛార్జ్షీట్ నమోదైంది. అప్పటి అటార్నీ జనరల్ కోరిక మేరకు ఈ కేసును 1979లో ఢిల్లీకి మార్చారు.