కేజ్రివాల్ కిసాన్ ర్యాలీ: రైతు ఆత్మహత్య, ఉద్రిక్తత
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెడుతున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్(ఆప్) అరవింద్ కేజ్రివాల్ ఆధ్వర్యంలో చేపట్టిన కిసాన్ ర్యాలీలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిసాన్ ర్యాలీ నిర్వహిస్తున్న సమీపంలోని ఓ చెట్టు ఎక్కిన సదరు రైతు, చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
గమనించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అతడ్ని వెంటనే కిందికి దించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే సదరు రైతు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అరవింద్ కేజ్రివాల్ కూడా ఆస్పత్రికి వచ్చారు.
కిసాన్ ర్యాలీ
కేంద్రం
ప్రవేశపెడుతున్న
భూసేకరణ
చట్టానికి
వ్యతిరేకంగా
ఢిల్లీ
ముఖ్యమంత్రి,
ఆమ్
ఆద్మీ
పార్టీ
కన్వీనర్(ఆప్)
అరవింద్
కేజ్రివాల్
ఆధ్వర్యంలో
చేపట్టిన
కిసాన్
ర్యాలీలో
ఓ
రైతు
ఆత్మహత్యకు
పాల్పడ్డాడు.
కిసాన్ ర్యాలీ
కిసాన్ ర్యాలీ నిర్వహిస్తున్న సమీపంలోని ఓ చెట్టు ఎక్కిన సదరు రైతు, చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
కిసాన్ ర్యాలీ
గమనించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అతడ్ని వెంటనే కిందికి దించారు.
కిసాన్ ర్యాలీ
హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే సదరు రైతు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అరవింద్ కేజ్రివాల్ కూడా ఆస్పత్రికి వచ్చారు.
మృతుడ్ని గజేంద్రగా గుర్తించారు. అతడు రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తాను ఓ రైతు కొడుకునని, రాజస్థాన్లోని నంగల్ ఝాల్వార్ ప్రాంతానికి చెందినవాడినని అందులో పేర్కొన్నాడు.
తన పంట మొత్తం సర్వనాశనం కావడంతో తన తండ్రి ఇంట్లోంచి గెంటేశారని నోట్లో తెలిపాడు. తనకు ముగ్గురు పిల్లలున్నా.. చేయడానికి పనేమీ లేదని, ఇప్పుడు ఇక ఇంటికి ఎలా వెళ్లాలో మీరే చెప్పాలని ఆ లేఖలో అతడు ప్రశ్నించాడు. కాగా, రైతు మృతితో కిసాన్ ర్యాలీ కొంత ఉద్రిక్తంగా మారింది.