మళ్లీ మొదటికి?: 2జీ కేసులో రాజా, కనిమొళికి హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: టెలికాం శాఖ మాజీ మంత్రి మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 2జీ స్పెక్ట్రం కేసు నిందితులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ కుంభకోణం కేసులో 'సరైన ఆధారాలు' లేవంటూ కొద్ది నెలల క్రితం సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఎ రాజా సహా ఈ కేసులోని కీలక నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ, ఈడీ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి తీర్పును మే 25కు వాయిదా వేసింది.

ఈడీ జప్తు చేసిన ఆస్తులపై యథాతథ స్థితిని కొనసాగించాలని కూడా కోర్టు ఆదేశించింది. దీంతో జప్తు చేసిన ఆస్తులన్నీ ఈడీ స్వాధీనంలోనే ఉండనున్నాయి.
తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై రాజా స్పందిస్తూ... 'తిరస్కారానికి గురైన వాళ్లు పై కోర్టులో అప్పీలు చేసుకోవడం చట్టబద్ధమైన హక్కు. ఒక వేళ నన్ను దోషిగా నిర్ధారిస్తే నేను కూడా అప్పీలు చేసుకుంటాను కదా? ఇందులో ప్రత్యేకత ఏముంది? ఇదంతా మామూలే. ఈ విషయం మాకు ముందే తెలుసు' అని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications