షాకింగ్: కుప్పకూలిన బ్రిడ్జి - శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుడు -ఢిల్లీలోని పంజాబీ బాగ్లో ఘటన
దేశరాజధాని ఢిల్లీలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. అక్కడ పనిచేస్తోన్న నిర్మాణ కార్మికుల్లో ఒకరు శిధిలాల కింద చిక్కుకుపోయాడు.
viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్పై వచ్చి ఓటేసిన విజయ్ -ఫ్యాన్స్పై పోలీసుల లాఠీచార్జ్
ఢిల్లీలోని పంజాబ్ బాగ్ లో దాదాపు కిలో మీటరు పొడవున వంతెన నిర్మాణం సాగుతోంది. అందులోని ఓ భాగం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి.
శిధిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని, అతణ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. బ్రిడ్జిలో ఓ భాగం కూలడంతో పంజాబీ బాగ్ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. శిధిలాల తొలగింపునకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.