లిమ్కా బుక్‌ రికార్డుకెక్కిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద నగదు చోరీని ఛేదించినందుకు ఢిల్లీ పోలీసులు లిమ్కా బుక్‌ రికార్డుకెక్కారు. గత నవంబరు 27న ఓ నగదు తరలింపు వాహనం నడిపే డ్రైవరు రూ.22.50 కోట్ల డబ్బుతో పరారయ్యాడు.

దీంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి పది గంటల్లోనే ఆ వాహనాన్ని పట్టుకోగలిగారు. ఇందులో రూ.10,500 తప్ప మిగిలిన డబ్బంతా అలాగే ఉంది. ఈ డబ్బును డ్రైవరు ఖర్చులకు ఉపయోగించుకున్నాడని పోలీసులు చెప్పారు.

తమకు లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో దక్కడంతో ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ బీఎస్‌ బస్సీ ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో దోపిడీకి గురైన భారీ మొత్తం రూ. 22.49కోట్లను గంటల్లోనే ఛేధించినందుకు ఈ అవార్డు వచ్చిందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+