ఉగ్రవాదులు: డ్రైవర్ను చంపి అదే క్యాబ్లో ఢిల్లీకి...?
పఠాన్ కోట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ లో మళ్లీ కలకలం రేగింది. ఆచూకీ లేకుండా పోయిన క్యాబ్ డ్రైవర్ విజయ్ కుమార్ హత్యకు గురై కనిపించాడు. హిమాచల్ ప్రదేశ్ లోని ఓ నిర్జనప్రదేశంలో శుక్రవారం ఇతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడిప్పుడే ఉగ్రవాద దాడి నుంచి కోలుకుంటున్న పఠాన్ కోట్ లో మళ్లీ కలకలం రేగింది. క్యాబ్ డ్రైవర్ విజయ్ కుమార్ ను హత్య చేసిన ముగ్గురు ఉగ్రవాదులు అతని ఆల్టో కారుతో సహ మాయం అయ్యారని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.
ముగ్గురు ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కుమార్ హత్యకు గురైనాడని విషయం వెలుగు చూడటంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి జరగక ముందే విజయ్ కుమార్ క్యాబ్ ను కొందరు అపహరించారు. తరువాత అతనిని హత్య చేసిన నిందితులు గుట్టు చప్పుడు కాకుండా ఢిల్లీ చేరుకున్నారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవాలను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నిన నేపథ్యంలోనే క్యాబ్ డ్రైవర్ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications