సునంద మృతి: పాక్ జర్నలిస్ట్ను విచారించనున్న పోలీసులు, భారత్ రానని మెహర్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్ను ప్రశ్నించనున్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ గురువారం ఈ విషయమై మాట్లాడారు.
తాము మెహర్ తరర్తో మాట్లాడుతామని, ఈ కేసులో ఆమె కూడా ముఖ్యమైన వ్యక్తి అన్నారు. కాగా, సునంద పుష్కర్, శశిథరూర్ మధ్య విభేదాలకు మెహర్ తరర్ అనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే.

మెహర్ తరర్ మాట్లాడుతూ.. తాను విచారణ కోసం భారత్కు రానని, విచారణాధికారులే పాకిస్తాన్ రావొచ్చునని చెప్పింది. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపింది. తాను ఎప్పుడైనా సిద్ధమని చెప్పింది. అయితే, తాను భారత దేశానికి రానని చెప్పింది. భారత విచారణాధికారులు లాహోర్కు మాత్రం రావొచ్చునని చెప్పింది.
సునంద పుష్కర్తో ట్విట్టర్లో గొడవ పడడమే తాను చేసిన పెద్ద తప్పు అని ఆమె వాపోయింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇది త్వరలో ముగిసిపోతుందని తాను విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని చెప్పింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications