బెయిల్ ఇవ్వం: పోలీసు కస్టడీకి టీటీవీ దినకరన్, బెంగళూరు, చెన్నై, కోచ్చిలో!
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారని ఆరోపణలపై అరెస్టు అయిన అన్నాడీఎంకే పార్టీ నేత టీటీవీ దినకరన్ ను బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దినకరన్ ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు న్యాయస్థానంలో మనవి చేశారు.
ఈ కేసుకు దినకరన్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు జామీను మంజూరు చెయ్యాలని టీటీవీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని పక్కా ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.

దినకరన్ ను విచారించి పూర్తి వివరాలు సేకరించడానికి వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో మనవి చేశారు. దినకరన్ కు కస్టడీకి ఇవ్వడానికి ఆయన న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇరు వర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాలుగు రోజులు దినకరన్ ను పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దినకరన్ ను విచారించడానికి చెన్నై, కోచ్చి, బెంగళూరు నగరాలకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ క్రైం బ్రాంచ్ కు చెందిన ఓ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications