స్కూల్లోనే టెన్త్ విద్యార్థిని డెలీవరీ, ఎక్కడంటే?
స్కూల్ మరుగుదొడ్డిలో పదవతరగతి విద్యార్థిని ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకొంది.
న్యూఢిల్లీ: స్కూల్ మరుగుదొడ్డిలో పదవతరగతి విద్యార్థిని ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకొంది. బాలిక పక్కింటి వ్యక్తి గత ఏడాదిగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది.ఈ ఘటన సంచలనం సృష్టించింది.
న్యూఢిల్లీలోని ప్రభుత్వపాఠశాలలో పదవతరగతి చదివే విద్యార్థిని శనివారం నాడు పరీక్ష రాసేందుకు స్కూల్కు వెళ్ళింది.అయితే ఆమె కడుపునొప్పంటూ బాత్రూమ్కు వెళ్ళింది.
అయితే అక్కడే ఆమె శిశువుకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకొన్న పాఠశాల సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారమిచ్చారు.
బాలికను విచారించిన పోలీసులకు షాకింగ్ గురయ్యే విషయాలు వెలుగుచూశాయి. పోరుగింటి వ్యక్తి బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. అతడి వయస్సు 51 ఏళ్ళుగా తేలిందని పోలీసులు గుర్తించారు.
లైంగికదాడికి పాల్పడుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని అతను డబ్బులు ఇచ్చేవాడని బాధితులు చెప్పింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఆటో నడుపుతున్న నిందితుడు బీహర్ రాష్ట్రానికి చెందినవాడుగా గుర్తించారు.
తనకు కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో నిందితుడు పలుమార్లు బాలికకు అబార్షన్ మాత్రలు కూడ ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. పిల్స్ కారణంగానే బాలికకకు 20వ, వారంలోనే డెలివరీ అయినట్టు వైద్యులు తేల్చారు.