ఇక 9, 11 తరగతులు కూడా.. 5వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభం..సిసోడియా

కరోనా వైరస్ వల్ల ఇప్పడిప్పుడే స్కూల్స్ తెరచుకుంటున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఓపెన్ చేస్తున్నారు. టీకాలు కూడా అందుబాటులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధైర్యం చేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి ఢిల్లీలో 10, 12 తరగతులకు స్కూల్స్/ కాలేజీ ప్రారంభమయ్యాయి. దానిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

 Delhi schools reopening for classes 9 and 11 from February 5 onwards

9,11 తరగతులకు కూడా స్కూల్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చెనెల 5వ తేదీ నుంచి ఓపెన్ చేస్తామని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియ తెలిపారు. దీంతోపాటు కాలేజీ/ డిగ్రీ/ డిప్లొమా కూడా తెరుస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే విద్యార్థులు తమ పేరంట్స్ అనుమతి తీసుకొని రావాల్సి ఉంది. అయితే విద్యాసంస్థలు కోవిడ్-19 ప్రొటొకాల్ మాత్రం పాటించాల్సి ఉంది.

10, 12 తరగతుల విద్యార్థులకు స్కూల్స్ గత 10 నెలల నుంచి మూసివేసి ఉంది. అయితే తుది పరీక్షలు నిర్వహించాలనే ఆలోచనతో ఓపెన్ చేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత స్కూల్/ కాలేజీ తెరుస్తామని మనీశ్ సిసోడియా ఇదివరకే చెప్పారు. ఆ మేరకు ప్రభుత్వం నడచుకుంది. విద్యార్థులు/ అధ్యాపకులు రక్షణను ఉద్దేశించి స్కూల్ తెరుస్తామని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+