కూతురు కిడ్నాప్ యత్నం, సింగంలా దుండగుల నుంచి లాక్కుని కాపాడుకున్న తల్లి(వీడియో)
న్యూఢిల్లీ: తల్లి ప్రేమ ముందు ఏ దుష్టశక్తి కూడా పనిచేయదని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. తన కూతురును అపహరించేందుకు ప్రయత్నించిన దుండగుల బారి నుంచి ఆదిశక్తిలా మారిన తల్లి.. వారిని తరిమికొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Recommended Video
మంగళవారం సాయంత్రం బైక్పై శకర్పూరు ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఓ తల్లి నుంచి తన నాలుగేళ్ల కూతురును లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన తల్లి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది. చిన్నారిని వారి నుంచి తిరిగి లాగేసుకుంది.
తల్లి ప్రతిఘటనకు షాకైన దుండగులు అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాన్ని చూసిన ఓ స్థానికుడు రోడ్డుపై తన స్కూటర్ అడ్డుపెట్టి ద్విచక్ర వాహనంపై పారిపోతున్న దుండగులను అడ్డుకున్నాడు. కిందకు తోసేసి వారిని పట్టుునే ప్రయత్నం చేశాడు.
Thrilling story of a mother's courage, neighbours' concern & presence of mind. 2 people tried to kidnap a child in Delhi. Mother fights & snatches her child back. One neighbour chases them & a youth blocks them with a scooter. Finally they're caught through bike records. pic.twitter.com/CTiytMuyE9
— Vibhinna Ideas (@Vibhinnaideas) July 22, 2020
అయితే, ఎలాగోలా దుండగులు తప్పించుకుని అక్కడ్నుంచి పరారయ్యారు. కాగా, ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇక దుండగులు వదిలేసిన బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఆ చిన్నారి కిడ్నాప్నకు ఆమె అంకుల్ ఉపేంద్ర(బిట్టు)నే సూత్రధారి కావడం గమనార్హం. పాపను కిడ్నాప్ చేస్తే రూ. 1 లక్ష ఇస్తామని చెప్పాడని నిందితులు పోలీసులు చెప్పారు. కాగా, నిందితుల నుంచి ఓ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.