కొత్త నోట్ల కోసం ఓపిక నశించి.. టాప్లెస్గా 'క్యూ'లో నిలుచుంది..
న్యూఢిల్లీ : దేశంలో నోట్ల రద్దు సామాన్య జనం సహనాన్ని పరీక్షించేదిగా మారింది. పనులన్ని మానుకుని బ్యాంకులు, ఏటీఎంలు చుట్టు ప్రదక్షిణలు చేసినా.. నోట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో.. తీవ్ర అసహనంలో ఉన్నారు చాలామంది సామాన్య జనం. విపరీతమైన ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేస్-3 ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎం వద్ద గంటల తరబడి క్యూ లో వేచియున్న ఓ యువతి.. ఓపిక నశించి ఎవరూ ఊహించని చర్యకు పాల్పడింది. ఏకంగా తన టాప్ ను పూర్తిగా తొలగించేసి క్యూలో అలాగే నిలబడిపోయింది. టాప్ లెస్ గా యువతి క్యూ లో నిలుచుండడంతో జనమంతా ఆమె వైపే చూపు తిప్పుకున్నారు.
యువతి చర్యను పక్కనున్న మహిళలు వారించినా.. ఆమె మాత్రం వారి మాట వినే ప్రయత్నం చేయలేదు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఓ యాక్సిస్ బ్యాంకు ఏటీఎం నుంచి పోలీసులే డబ్బులు డ్రా చేసి ఇచ్చి.. ఆమెను పంపించేశారు. మొత్తానికి నోట్ల రద్దు ఫ్రస్టేషన్.. సామాన్యులను చిత్ర విచిత్రంగా ప్రవర్తించేలా చేస్తోంది.