Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందరి నోటా ఒకటే నినాదం.. జై శ్రీరామ్

Ayodhya Ram Mandir: నేడు శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవార జాము నుంచే క్రిక్కిరిసిపోయాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో ఏటేటా అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలకు సిద్ధం అయ్యాయి.

అటు ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమైన రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో రామ్ లల్లాను దర్శించుకుంటోన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అయోధ్యాపురి నిండిపోయింది. ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటోన్నారక్కడ. అర్ధరాత్రి నుంచే ఆలయం ముందు బారులు తీరి నిల్చున్నారు.

Devotees floated to offered prayers to Ram Lalla in Ayodhya on the occasion of Ram Navmi 2025

గత ఏడాది జనవరి 22వ తేదీన రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు.

మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఆరంభమైంది. 12:31 నిమిషాలకు పూర్తయింది. మొత్తం 86 సెకెండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే.

అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం అనంతరం శ్రీరామనవమి జరుపుకోవడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అయోధ్యానగరం నిండిపోయింది. బాల రాముడిని దర్శించుకోవడానికి ఆలయాలనికి పోటెత్తారు. సరయూ నదిలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.

Devotees floated to offered prayers to Ram Lalla in Ayodhya on the occasion of Ram Navmi 2025

రామనవమి సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. విద్యుద్దీపాల వెలుగులో రామమందిరం మెరిసిపోతూ కనిపించింది. ఆలయం ముఖ ద్వారం వద్ద బాల రాముడి నగుమోమును ప్రతిబింబించేలా పూలతో అందంగా అలకరించారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో అయోధ్య మార్మోగిపోతోంది.

ఈ తెల్లవారు జామున 4 గంటలకు గేట్లను తెరిచిన మరుక్షణమే లోనికి పరుగులు తీశారు. కాషాయ దుస్తులు ధరించి, హనుమ ధ్వజాలను చేతపట్టుకుని, జైశ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉప్పెనలా ఆలయంలోనికి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది.

ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. ఆలయానికి దారి తీసే మార్గాల్లో బ్యారికేడ్లను అమర్చారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి అదనపు పోలీసు సిబ్బందిని విధి నిర్వహణలో ఉంచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+