శబరిమల భక్తులు అర్బన్ నక్సల్స్ : కేంద్రమంత్రి మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి మహిళల ప్రవేశంపై విస్తృత స్థాయి ధర్మాసనంకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా శబరిమలకు వెళుతున్న భక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్. శబరిమలకు వెళుతున్న భక్తులను అర్బన్ నక్సల్స్గా పేర్కొన్నారు. వారంతా అరాచకవాదులని నాస్తికులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి మురళీధరన్. వాళ్లు నిజమైన భక్తులా కాదా అని తెలియాలంటే కొండపైకి వచ్చే వారిని విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
భక్తితో వెళ్లడం లేదు..పేరకు మాత్రమే వెళుతున్నారు
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నామని చెప్పుకునేందుకే భక్తుల పేరుతో ఆలయంకు వెళుతున్నారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి మురళీధరన్. వారు నిజంగా భక్తితో అక్కడికి వెళ్లడం లేదని అభిప్రాయపడిన ఆయన.. వారంతా పేరుకు మాత్రమే వెళుతున్నారని చెప్పారు. నిజమైన భక్తులు కాదో లేదో తెలియాలంటే వారిని విచారణ చేయాలని చెప్పారు. భక్తుల కోసం శబరిమల ఆలయద్వారాలు శనివారం తెరుచుకున్న నేపథ్యంలో మంత్రి మురళీధరన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైయ్యాయి.

విస్తృత స్థాయి ధర్మాసనంకు రివ్యూ పిటిషన్ బదిలీ
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలు ప్రవేశించొచ్చు అన్న 2018 సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దాన్ని విస్తృత స్థాయి ధర్మాసనంకు బదిలీ చేస్తున్నట్లు అప్పటి తాజా మాజీ చీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ తీర్పుచెప్పారు. అయితే 2018నాటి సుప్రీంకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోవడంతో మహిళలు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన 10 మంది మహిళలను పంబ ప్రాంతం వద్ద అడ్డుకుని వెనక్కు పంపారు. వారంతా 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యవయస్సులో ఉన్నవారు కావడం విశేషం.

భద్రత కల్పించలేమన్న కేరళ సర్కార్
ఇదిలా ఉంటే గతేడాది స్వామి దర్శనానికి వచ్చిన కొంతమంది మహిళా భక్తులకు కేరళ ప్రభుత్వం భద్రత కల్పించింది. కానీ ఈ సారి మాత్రం భద్రత కల్పించేది లేదంటూ తెగేసి చెప్పేసింది. శనివారం ఉదయం 3 గంటలకు ఆలయద్వారాలు తెరిచారు ఆలయ ప్రధాన అర్చకులు ఏకే సుధీర్ నంబూత్రి. నెయ్యాభిషేకం జరిగిన వెంటనే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయంకు చేరుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తులు దాన్నేమీ లెక్కచేయకుండా సన్నిధానంకు హాజరయ్యారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications