మోడీకే ఝలక్ ఇచ్చిన దినకరన్ గ్రూప్, రామ్ నాథ్ కు మద్దతు ఇవ్వం: ఢిల్లీలో రివర్స్ గేర్ !
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన రామ్ నాథ్ కోవింద్ కు తాము మద్దతు ఇవ్వడం లేదని అన్నాడీఎంకే లోని టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.
చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన రామ్ నాథ్ కోవింద్ కు తాము మద్దతు ఇవ్వడం లేదని అన్నాడీఎంకే లోని టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. అయితే మాజీ స్పీకర్ మీరా కుమార్ కు మద్దతు ఇస్తారా అంటే మాత్రం నీళ్లు నములుతున్నారు.
ఎన్డీయే తరపున రామ్ నాథ్ కోవింద్ కు మేము మద్దతు ఇవ్వడంలేదని టీటీవీ దినకరన్ ముఖ్య అనుచరుడు, ఎమ్మెల్యే వెట్రివేల్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే వెట్రివేల్ చెన్నైలోని టీటీవీ దినకన్ ఇంటికి వెళ్లారు వెట్రివేల్ తో పాటు సినీ నటుడు, ఎమ్మెల్యే కరుణాస్ తదితర ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ ను కలిశారు.

ఎవరూ కాకపోతే, ఏంటి కథ !
దినకరన్ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే వెట్రివేల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇస్తారా అంటే, మా వర్గం ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇవ్వడం లేదని వెట్రివేట్ అన్నారు. అయితే మీరా కుమార్ కు మద్దతు ఇష్తారా అంటే సమాధానం దాటవేశారు.

34 మందితో టీటీవీ తిక్కచేష్టలు !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసిన టీటీవీ దినకరన్ తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని 34 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నారు. 34 మంది ఎమ్మెల్యేలతో టీటీవీ తిక్కచేష్టలు చేస్తున్నారని పన్నీర్ వర్గం మండిపడుతోంది.

మళ్లీ ఢిల్లీ కష్టాలు మొదలు ?
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వం అంటూ టీటీవీ వర్గంలోని ఎమ్మెల్యేలు బహిరంగంగా మీడియా ముందు చెప్పడంతో దినకరన్ కు మళ్లీ ఢిల్లీ కష్టాలు మొదలు కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బెట్టు చేస్తున్నాడా ?
ఢిల్లీ వెళ్లిన సమయంలో బీజేపీ నాయకులు తనను పట్టించుకోలేదని టీటీవీ దినకరన్ ఇప్పుడు సమయం చూసి బెట్టు చేస్తున్నారా ? అంటూ తమిళనాడులో చర్చ మొదలైయ్యింది. బీజేపీ నాయకులతో బేరసారాలు చెయ్యడానికి టీటీవీ దినకరన్ ఈ సమయంలో ఇలా వ్యవహరిస్తున్నారని సమాచారం.

ఢిల్లీలో తంబిదురై రివర్స్ !
అన్నాడీఎంకే పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, అందరూ కలిసే ఉన్నారని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఢిల్లీలో చెప్పారు. శశికళ వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కే మద్దతు ఇస్తున్నారని శుక్రవారం ఢిల్లీలో తంబిదురై మీడియాకు చెప్పారు. ఇప్పుడు శశికళ వర్గంలోనే రెండు వాదనలు వినిపిస్తున్నాయి.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications