"దమ్ముంటే కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తీసేయండి"
దేశంలోని ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) చట్టం పేరును'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)'.. సంక్షిప్తంగా వికసిత్ భారత్ - జీ రామ్ జీ బిల్లు అని పెట్టడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. మహాత్మా గాంధీ గుర్తింపు, వారసత్వాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరును 'వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు- 2025'గా మార్చడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీపై ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ గుర్తింపు, వారసత్వాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు.
పేరు మార్పు అసాధ్యమని శివకుమార్ తేల్చిచెప్పారు. కరెన్సీ నోట్లపైన ఉన్న మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించే ధైర్యం వారికి ఉందా అని సవాలు విసిరారు డీకే శివకుమార్. "మీరు గాంధీ పేరును మార్చలేరు. ధైర్యం ఉంటే తొలగించండి. అది చేయలేరు. సాధ్యం కాదు" అని ఆయన బీజేపీను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ బిల్లు MGNREGA ను రద్దు చేసి, దాని నుండి గాంధీ పేరును తొలగిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కొత్త బిల్లులో 60:40 నిధుల విభజన వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడమే కాకుండా.. చట్టబద్ధమైన 'పనిచేసే హక్కు' ను ఈ బిల్లు బలహీనపరుస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

లోక్ సభ శీతాకాల సమావేశాల్లో, 'వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025'కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 'వికసిత్ భారత్ @ 2047' లక్ష్యానికి అనుగుణంగా, ఈ బిల్లు ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని ఇస్తుంది. ఇది గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ అభివృద్ధిని బలోపేతం చేస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications