కరుణానిధికి అస్వస్థత: మళ్లీ ఆసుపత్రికి!, ప్రెస్ నోట్లో ఏం చెప్పారంటే!
చెన్నై: డీఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్యం మరోసారి క్షీణించినట్లుగా తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో.. కుటుంబ సభ్యుల్లోను, పార్టీ వర్గాల్లోను ఆందోళన మొదలైంది.
శ్వాస కోశ సమస్య వల్లే ఆయన ఆసుపత్రిలో చేరాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన శరీరంలో అమర్చిన కృత్రిమ అన్న వాహిక(ఫుడ్ పైప్)ను మార్చేందుకే ఆసుపత్రిలో చేర్పించారని కావేరీ ఆసుపత్రి వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేశాయి.

ఆసుపత్రికి తరలించిన గంటలోనే తిరిగి ఆయన ఇంటికి కూడా చేరినట్లు అందులో వెల్లడించారు. కాగా గతేడాది డిసెంబర్ లో కరుణానిధి శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తడంతో అప్పట్లో ఆయన కావేరీ ఆసుపత్రిలోనే చికిత్స పొందారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications