పన్నీర్ సెల్వను అనర్హుడిని చెయ్యండి: మద్రాసు హైకోర్టుకు డీఎంకే, చట్టం అందరికీ ఒక్కటే !
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహ 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది.
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహ 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద 18 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం, పార్టీ మీద తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. 18 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు. గత ఫిబ్రవరి నెలలో ఎడప్పాడి పళని సామి శాసన సభలో బలపరీక్ష నిర్వహించారు.

ఆ సమయంలో పన్నీర్ సెల్వంతో సహ 11 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటు వేశారని, స్పీకర్ ధనపాల్ అప్పుడు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని డీఎంకే పార్టి నాయకుడు ఆర్. చక్రపాణి చెప్పారు.
పన్నీర్ సెల్వంకు ఒక చట్టం, 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు ఒక చట్టమా అని స్పీకర్ ను ప్రశ్నించాలని మద్రాసు హైకోర్టుకు మనవి చేశామని ఆర్. చక్రపాణి వివరించారు. మద్రాసు హైకోర్టు బుధవారం పిటిషన్ విచారణ చేసే అవకాశం ఉందని డీఎంకే పార్టీ నాయకుడు ఆర్, చక్రపాణి చెప్పారు.
మొత్తం మీద అన్నాడీఎంకే పార్టీ ఇంటి పోరు విషయంలో ఇప్పుడు డీఎంకే పార్టీ కోర్టుకు వెళ్లడంతో పన్నీర్ సెల్వంతో పాటు 11 మంది ఎమ్మెల్యేల విషయంలో మద్రాసు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications