డీఎంకే ఎంపీ జగత్రకక్షకన్కు భారీ షాక్: రూ. 908 కోట్ల జరిమానా విధించిన ఈడీ
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే పార్లమెంట్ సభ్యుడు ఎస్ జగత్రక్షకన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘనల కేసులో ఎంపీ జగత్ రకక్షకన్ తోపాటు ఆయన కుటుంబానికి రూ. 908 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వెల్లడించింది.
ఫెమా చట్టంలోని 37ఎ సెక్షన్ ప్రకారం 2020 సెప్టెంబర్లో సీజ్ చేసిన రూ. 89.19 కోట్ల మొత్తాన్ని జప్తు చేసినట్లు తెలిపింది. ఆగస్టు 26న వచ్చిన తీర్పు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. వ్యాపారవేత్త అయిన 76 ఏళ్ల జగత్ రక్షకన్ ప్రస్తుతం అరక్కోణం లోక్సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

'ఫెమా సెక్షన్ 37A ప్రకారం రూ. 89.19 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడానికి కూడా ఆదేశించింది. 26 ఆగస్టు, 2024 నాటి అడ్జుడికేషన్ ఆర్డర్ ప్రకారం రూ. 908 కోట్ల జరిమానా విధించడం జరిగింది' అని ఈడీ పేర్కొంది.
ఈ ఆస్తుల జప్తును ఆగస్టు 26న జారీ చేసిన న్యాయమూర్తులు ధృవీకరించారు. విదేశీ మారకద్రవ్య నిబంధనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తమ కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ ప్రకటన హైలైట్ చేసింది.
Enforcement Directorate (ED) Chennai had conducted investigation under FEMA against Jagathrakshakan, a businessman from Tamil Nadu and Member of Parliament (from DMK), his family members and related Indian entity. The properties worth Rs. 89.19 Crore which was seized in terms of… pic.twitter.com/tpGMkn2fHa
— ANI (@ANI) August 28, 2024
జగత్ రక్షకన్పై కేసు అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడానికి అమలు చేస్తున్న కఠినమైన చర్యలను గుర్తు చేస్తుంది. ఇది భారతదేశంలోని ప్రజా వ్యక్తులు, వ్యాపారవేత్తలలో పారదర్శకత, జవాబుదారీతనం ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది.












Click it and Unblock the Notifications