ఐసీయులో చికిత్స పొందుతున్న యువతిపై రెండుసార్లు రేప్
అహ్మదాబాద్: గుజరాత్లోని గాంధీ నగర్లో దారుణం జరిగింది. స్థానిక ఆసుపత్రికి డెంగ్యూ చికిత్స కోసం వచ్చిన మహిళ పైన అక్కడ పని చేస్తున్న ఓ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డెంగ్యూతో బాధపడుతన్న 21 ఏళ్ల యువతి ఇటీవల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పైన రాత్రి వేళలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్ చౌహాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలోని వార్డు బాయ్ సహకారంతో డాక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఆసుపత్రిలోని వార్డు బాయ్ సహకారంతో డాక్టర్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన డాక్టరుతో పాటు సహకరించిన వార్డు బాయ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆసుపత్రిలో చేరిన ఆమె పైన రెండుసార్లు అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది.