చైనాపై పంతం నెగ్గించుకున్న భారత్: డొక్లాంలో ఇరుదేశాల సైన్యాలు వెనక్కి
రెండు నెలలకు పైగా భారత్, భూటాన్, చైనా సరిహద్దులోని డోక్లామ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
న్యూఢిల్లీ/బీజింగ్: రెండు నెలలకు పైగా భారత్, భూటాన్, చైనా సరిహద్దులోని డోక్లామ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించేందుకు సిద్దపడ్డాయి.
చాలా రోజుల తర్వాత ఉద్రిక్త పరిస్థితి ఎట్టకేలకు సమసిపోయింది. ఇక్కడ మోహరించిన భారత్, చైనాల సైన్యం ఒకేసారి వెనక్కు మళ్లేలా ద్వైపాక్షిక చర్చల్లో ఒప్పందం కుదిరింది.

ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకున్నామని పేర్కొంది. ఇక సాధ్యమైనంత త్వరగా సరిహద్దుల్లోని సైన్యాన్ని రెండు దేశాలూ వెనక్కు పిలుచుకోనున్నాయని తెలిపింది.
కాగా, చైనా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమవుతున్న సమయంలో ఈ వివాదం సమసిపోవడం గమనార్హం. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ చైనాకు వెళ్లనున్నారు.
కాగా, ఇప్పటికే చైనా, భారత్లు తమ సైన్యాలను వెనక్కు తీసుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక నేడే మొత్తం సైన్యం వెనక్కు వస్తుందా? లేక దశలవారీగా వస్తుందా? అన్న విషయమై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు. రెండు దేశాలూ ఒకేసారి సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదినుంచి డిమాండ్ చేస్తున్న భారత్, తన పంతాన్ని నెగ్గించుకోవడం విశేషం.
-
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications