చైనా సరిహద్దు వెంట సైన్యాన్ని మోహరించిన ఇండియా
న్యూఢిల్లీ: చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకుగాను భారత్ సన్నద్దమౌతోంది. డోక్లామ్, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్లలో మరింత సైన్యాన్ని మోహరించింది భారత్.
డోక్లామ్ వద్ద భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం సాగుతోంది.ఈ తరుణంలోనే చైనా కూడ అమీతుమీకి సిద్దమంటూ ప్రకటనలు చేస్తోంది. భారత్ కూడ తాము తక్కువేమీ కాదని ప్రకటించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దమేనని ఇండియా కూడ ప్రకటించింది.

ఈ తరుణంలోనే చైనా సరిహద్దు వెంట అరుణాచల్ప్రదేశ్, డోక్లామ్, సిక్కిం వద్ద సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించింది భారత్. సుమారు 1400 కిలోమీటర్ల చైనా ఇండియా సరిహద్దు వెంట సిక్కిం నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సైన్యాన్ని పెద్దఎత్తున ఇండియా మోహరించింది.
సైనో -ఇండియా సరిహద్దును రక్షించేందుకు సుకునాకు చెందిన 33 , అరుణాచల్,అస్సాంలలోని 3, 4 దళాలు పనిచేయనున్నాయి.
అయితే చైనా మాత్రం డొక్లామ్ వద్ద ఉన్న తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడ గతంలోనే చైనా హెచ్చరించింది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్












Click it and Unblock the Notifications