అమానవీయం: కారుకు రక్తపు మరకలంటుతాయని.. ఇద్దరు యువకుల ప్రాణం తీసిన పోలీసులు
సహరాన్పూర్: మానవత్వం లేని ఓ పోలీసు అధికారి కారణంగా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొట్టుమిట్టాడుతున్న యువకుల ప్రాణాలు కాపాడాల్సిన ఆ బాధ్యతల గల పోలీసు అధికారి.. పెట్రోలింగ్ కారుకు రక్తపు మరకలు అంటుతాయని వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఒప్పుకోలేదు.
తమను కాపాడాలంటూ గాయపడిన వారిలో ఒకరు వేడుకున్నప్పటికీ ఆ పోలీసు అధికారి, మరో ముగ్గురు పోలీసులు స్పందించకపోవడం విచారకరం. దీంతో సరైన సమయంలో చికిత్స అందక ఆ యువకులు మృతి చెందారు. ఈ అమానవీయ ఘటన గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్పూర్లో చోటు చేసుకుంది.

కాపాడాలంటూ వేడుకున్నా..
ఘటనా స్థలంలో వేరే వాహనం కూడా లేదని, దయచేసి గాయపడిన యువకులను ఆస్పత్రికి తరలించాలంటూ అక్కడున్న కొందరు కూడా పోలీసులను వేడుకున్నారు. అయినా కూడా స్పందించని పోలీసులు.. అక్కడే నిల్చున్నారే గానీ.. వారికి ఎలాంటి సాయమూ అందించలేదు. తమ పెట్రోలింగ్ కారుకు రక్తపు మరకలు అంటుతాయంటూ వారిని ఆస్పత్రికి తరలించకపోవడం గమనార్హం.

ఆలస్యం కావడంతో యువకులు మృతి
అంతేగాక, రక్తపు మరకలతో కారు ఉంటే తాము ఎక్కడ కూర్చోవాలంటూ పోలీసులే వారిని ఎదురు ప్రశ్నించడం శోచనీయం. కాగా, కొంత సేపటి తర్వాత వచ్చిన స్థానిక పోలీసులు.. గాయపడిన ఇద్దరు యువకులను తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ యువకులు మృతి చెందారని వైద్యులు తెలిపారు.

కఠిన చర్యలు తీసుకుంటాం
కాగా, ఈ ఘటనపై సహరాన్పూర్ డీఐజీ సునీల్ ఎమాన్యూల్ తీవ్రంగా స్పందించారు. అమానవీయంగా వ్యవహరించిన సదరు ముగ్గురు పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విచారణ జరిపి వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

వీడియో వైరల్
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో సదరు పోలీసులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications