నేనున్నాను, పక్కన పెడితే, భూకంపం సృష్టిస్తాను
టిక్కెట్ల కేటాయింపులో ఇబ్బందులు పడకూడదని, తాను ఉన్నానని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన సన్నిహిత ఎంఏల్ఏలకు భరోసా ఇచ్చారు.
లక్నో :వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు విషయమై ఇబ్బంది పడకూడదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన సన్ని:హిత ఎంఏఏల్ఏలకు హమీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన ఎంఏల్ఏలకు సూచించారు.
టిక్కెట్ల కేటాయింపులో తన సన్నిహిత ఎంఏల్ఏలకు బాబాయి శివపాల్ యాదవ్ టిక్కెట్లను కేటాయించడం లేదు. తన వ్యతిరేక వర్గీయులకే టిక్కెట్ల కేటాయింపులో పెద్ద పీట వేస్తున్నాడు. ఈ విషయమై ఆయన తనను కలిసిన సన్ని:హిత ఎంఏల్ఏలతో ఆయన చర్చించారు. ఇటీవల పార్లీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన వ్యతిరేక వర్గీయులకే పెద్ద పీట వేశాడు బాబాయి శివపాల్.

అయితే తనను నమ్ముకొన్న ఎంఏల్ఏలు ఎన్నికల్లో టిక్కెట్ట కేటాయింపులో తమకు మొండిచేయి చూపుతారనే భయంతో అఖిలేష్ ను కలిశారు. సుమారు 70 మంది ఎంఏల్ఏలు అఖిలేష్ ను కలిసి తమ భయాన్ని ఆయన వద్ద వ్యక్తం చేశారు.
టిక్కెట్ల కేటాయింపు విషయంలో బాబాయ్, అబ్బాయ్ ల మద్య వైరం సాగుతోంది. అయితే ఈ విషయమై ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలుచేశారు. తనను పక్కకు పెట్టి టిక్కెట్లు కేటాయించడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. తనను పక్కన పెడితే పార్టీలో మరోసారి భూకంపం వచ్చే పరిస్థితులు నెలకొంటాయని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications