ట్రంప్ నిర్ణయంతో ఎయిరిండియాకు పెరిగిన గిరాకీ
కొన్ని గల్ప్ దేశాల నుండి హ్యాండ్ లగేజీగా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్ళడంపై అమెరికా నిషేధం విధించింది.అయితే ట్రంప్ తీసుకొన్న నిర్ణయం ఎయిరిండియాను లాభాల బాటలో నడిపిస్తోంది.
న్యూఢిల్లీ: కొన్ని గల్ప్ దేశాల నుండి హ్యాండ్ లగేజీగా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్ళడంపై అమెరికా నిషేధం విధించింది.అయితే ట్రంప్ తీసుకొన్న నిర్ణయం ఎయిరిండియాను లాభాల బాటలో నడిపిస్తోంది.
అమెరికా వెళ్ళే ఎయిరిండియా టిక్కెట్లు దాదాపు వందశాతం అధికంగా అమ్ముడు అవుతున్నాయి.న్యూఢిల్లీ, ముంబై, హైద్రాబాద్ ల నుండి న్యూయార్క్ , చికాగో , శాన్ ఫ్రాన్సిస్కోలకు నాలుగు ఎయిరిండియా విమానాలు నడుస్తున్నాయి.
గత ఏడాది ఇదే సమయంలో ఒక్కో సర్వీసుకు 150 టిక్కెట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 300 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు.
డిమాండ్ పెరగడంతో భారత్ నుండి అమెరికాకు వెళ్ళే విమానటిక్కెట్టు ధర రూ.10 వేలు పెరిగిందని, అదే అమెరికా నుండి ఇండియాకు వచ్చే విమాన టిక్కెట్టు ధర రూ.15 వేలవరకు సంస్థ పెంచిందన్నారు.అయితే అమెరికా నుండి భారత్ కు వచ్చే విమాన టిక్కెట్ల అమ్మకాల్లో పెద్ద పెరుగుదల కన్పించలేదని ఆయన వివరించారు.