ఎయిరిండియా విమానంలో 'డ్రగ్స్'.. 2కేజీల మార్ఫిన్!: తీసుకొచ్చిందెవరు?..
చెన్నై నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలోని ఫుడ్ ట్రాలీలలో 2కేజీల డ్రగ్స్ ను అధికారులు గుర్తించారు.
న్యూఢిల్లీ: హైదరాబాద్ 'డ్రగ్స్' రాకెట్పై కీలక విచారణ జరుగుతుండగానే ఎయిరిండియా విమానంలో మత్తు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. చెన్నై నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలోని ఫుడ్ ట్రాలీలలో 2కేజీల డ్రగ్స్ ను అధికారులు గుర్తించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విమానం చెన్నై నుంచి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం చేరుకున్న తర్వాత ఎయిర్ ఇండియా విమానాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫుడ్ ట్రాలీలో ఎవరికి కనిపించకుండా ఈ డ్రగ్ ప్యాకెట్స్ను దాచిపెట్టినట్లు గుర్తించారు. అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కి సమాచారం ఇచ్చారు.

ప్యాకెట్ ను పరిశీలించిన పోలీసులు.. దాన్ని మార్ఫిన్ మిక్స్చర్ గా ధ్రువీకరించారు. ప్యాకెట్ లలో 2కేజీల వరకు దాన్ని దాచినట్లు గుర్తించారు. అయితే ప్యాకెట్ ఎవరు దాచిపెట్టి ఉంటారన్న దానిపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు సంస్థకు చెందినవారే ఈ డ్రగ్స్ దాచి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుండటం గమనార్హం. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications