రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా: అడ్డుకున్న డీఎస్పీని లారీలతో తొక్కించి, చంపారు
ఛండీగఢ్: హర్యానా రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా ఓ డీఎస్పీనే దారుణంగా హత్య చేసింది. తౌరు డీఎస్పీ సురేందర్ సింగ్ను గుగుగ్రామ్కు దగ్గరగా ఉన్న నుహ్స్ పచ్గావ్ సమీపంలో సోమవారం అక్రమ మైనింగ్ మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆయనను లారీలతో తొక్కించారు. దీంతో డీఎస్పీ అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా, డీఎస్పీ మృతదేహం బహిరంగ చెత్తకుప్పలో లభ్యమైంది. అయితే, డీఎస్పీ సురేందర్ సింగ్ త్వరలో పదవీ విరమణ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యలో ఒకటి కంటే ఎక్కువ లారీల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.
DSP Taoru Sh Surender Singh laid down his life today in the course of duty. #HaryanaPolice extends its deepest condolences to the bereaved family of the brave officer. No effort shall be spared in bringing the offenders to face justice.
— Haryana Police (@police_haryana) July 19, 2022
...@cmohry
మెవాత్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందన్న సమాచారంతో డీఎస్పీ సురేందర్ సింగ్ అక్కడికి వెళ్లారు. అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నవారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. పలు లారీలతో డీఎస్పీని ఢీకొట్టాయి. కిందపడిన అతనిపైనుంచి లారీలను ఎక్కించారు. దీంతో డీఎస్పీ అక్కడికక్కడే మరణించారు.
డీఎస్పీ సురేందర్ సింగ్ హత్య ఘటనపై హర్యానా పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. డీఎస్పీ హత్యకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఒక ధైర్యవంతుడైన అధికారిని తమ పోలీసు శాఖ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications