వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో భూ ప్రకంపనలు: జనం పరుగులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బుధవారం రాత్రి ఢిల్లీలో బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు 121 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

 Earthquake of 5.0 magnitude strikes Uttarakhand, tremors felt in Delhi-NCR

గురుగ్రామ్, హరిద్వార్, అల్మోరా, రామ్‌నగర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రాత్రి 8.49గంటలకు ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా, భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. ఇది ఇలా ఉండగా, ఉత్తరాఖండ్‌లోని ఛమోలీతోపాటు తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఢిల్లీలో భూ ప్రకంపనల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు బయటికి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇంతకుముందు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్, రాపార్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

English summary
A Strong earthquake tremors were felt in Delhi on Wednesday night. However, initial reports suggested that the epicentre of the earthquake was in Uttarakhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X