వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: మోదీ ప్రచారంపై నిషేధం కోరుతూ టీఎంసీ లేఖ -ఈసీపై సంచలన ఆరోపణలు -బీజేపీకి అనుకూలమంటూ

|
Google Oneindia TeluguNews

మిగతా రాష్ట్రాలకు భిన్నంగా పోలింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతోన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఈసీ చర్యలకు దిగిన వ్యవహారంలో వివాదం మరింత ముదిరింది. ఎన్నికల కమిషన్ తీరును ఆక్షేపిస్తూ, అది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదంటూ టీఎంసీ సంచలనల ఆరోపణలు చేసింది. అంతేకాదు, మిగతా దశల ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల ప్రచారంపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది..

ఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూ

ఈసీకి టీఎంసీ ఘాటు లేఖ..

ఈసీకి టీఎంసీ ఘాటు లేఖ..

కూచ్ బెహార్ కాల్పుల ఉదంతం, దానికి దారి తీసిన పరిణామాలకు సీఎం మమతా బెనర్జీనే బాధ్యురాలిగా పేర్కొంటూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమె ఎన్నికల ప్రచారంపై ఈసీ 24 గంటల నిషేధం విధించడం, ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీదీ మంగళవారమంతా ధర్నాకు బైఠాయించడం తెలిసిందే. దీదీపై వేటుతోపాటు గడిచిన నెల రోజులుగా బెంగాల్ లో జరుగుతోన్న పరిణామాలను ఉటంకిస్తూ, ఎన్నికల కమిషన్ తీరును ఎత్తిచూపుతూ టీఎంసీ బుధవారం ఈసీకే ఘాటు లేఖ రాసింది. అందులో..

బీజేపీకి అనుకూలంగా ఈసీ..

బీజేపీకి అనుకూలంగా ఈసీ..

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సరిగా పనిచేయడం లేదని, దాని వ్యవహారాలు అత్యంత దుర్భరంగా ఉన్నాని, టీఎంసీ ఫిర్యాదులపై ఒకలా, బీజేపీ ఫిర్యాదులపై మరోలా స్పందిస్తూ, నూరు శాతం పక్షపాత ధోరణిలో, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని టీఎంసీ ఆరోపించింది. ఈసీ అనుచిత, పక్షపాత ధోరణిని బెంగాల్ ప్రజలంతా గమనిస్తున్నారని, టీఎంసీ అభ్యర్థులకు ఓట్లేయడం ద్వారా ప్రజలు.. ఈసీ తీరుకు తగిన సమాధానం చెబుతున్నారని రెండు పేజీల లేఖలో టీఎంసీ తీవ్ర విమర్వలు చేసింది.

మోదీ, షాలను నిషేధించండి..

మోదీ, షాలను నిషేధించండి..

బెంగాల్ లో ఇప్పటిదాకా పూర్తయిన నాలుగు దశల ఎన్నికల్లో ఈసీ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించిందని, కనీసం రాబోయే నాలుగు దశల్లోనైనా ఈసీ నిబంధనలకు లోబడి పనిచేయాలని లేఖలో టీఎంసీ పేర్కొంది. బీజేపీ ఫిర్యాదులపై స్పందించిన విధంగానే టీఎంసీ అభ్యంతరాలను ఈసీ పరిశీలించాలని, ఇప్పటికే పలు మార్లు కోడ్ ఉల్లంఘిస్తూ అనుచిత ప్రసంగాలు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై రాబోయే విడదలకైనా ప్రచారాన్ని నిషేధించాలని టీఎంసీ డిమాండ్ చేసింది.

షాకింగ్: కరోనా విలయంలో తొలిసారి -ఆస్పత్రి నుంచి వ్యాక్సిన్లు చోరీ -బ్లాక్ మార్కెట్‌కు తరలింపు!షాకింగ్: కరోనా విలయంలో తొలిసారి -ఆస్పత్రి నుంచి వ్యాక్సిన్లు చోరీ -బ్లాక్ మార్కెట్‌కు తరలింపు!

ఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలు ఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలు

English summary
The Trinamool Congress (TMC) on Wednesday wrote a letter to the Election Commission of India alleging that the poll panel is "malfunctioning" and its state of affairs is "deplorable". In a two-page letter, the TMC accused the Election Commission of having a partisan approach while acting on complaints filed by the TMC and BJP. tmc demands ec that Narendra Modi and Amit Shah should be banned for campaigning for the remaining phases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X