4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల: తెలంగాణపై ఈసీ ప్రకటన
హైదరాబాద్: తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం స్పష్టమైన ప్రకటన చేసింది. తెలంగాణలో ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని తెలిపింది. హైకోర్టు తీర్పు తర్వాతే ఎన్నికల నిర్వహణ జరుగుతుందని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రకటనకు ఇంకా సమయం ఉంది. ఓటర్ల తుది జాబితా అక్టోబర్ 8న ప్రకటించాల్సి ఉంది. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా, అనూహ్యంగా నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ కూడా ఈసీ ప్రకటించేసింది.
ఒకే దశలో తెలంగాణ పోలింగ్
తెలంగాణలో నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 19న నామినేషన్లకు తుది గడువు
Recommended Video
నామినేషన్ల పరిశీలన : నవంబర్ 20
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : నవంబర్ 22
డిసెంబర్ 7న పోలింగ్
డిసెంబర్ 11న ఫలితాలు
మిజోరాం
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
- నోటిఫికేషన్ నవంబర్ 2
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 9
- నామినేషన్ల పరిశీలన నవంబర్ 12
- నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 14
- ఎన్నికలు నవంబర్ 28
- ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11
మధ్యప్రదేశ్
230 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
- నోటిఫికేషన్ నవంబర్ 2
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 9
- నామినేషన్ల పరిశీలన నవంబర్ 12
- నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 14
- పోలింగ్ నవంబర్ 28
- ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11
ఛత్తీస్గఢ్
90 శాసనసభ స్థానాలు ఉన్న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోని 18 స్థానాల్లో తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి.
మొదటి విడతలో..
- నోటిఫికేషన్ అక్టోబర్ 16
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 23
- నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24
- నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 26
- ఎన్నికలు నవంబర్ 12
- ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11
రెండో విడతలో..
- నోటిఫికేషన్ అక్టోబర్ 26
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబరు 2
- నామినేషన్ల పరిశీలన నవంబర్ 3
- నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 5
- ఎన్నికలు నవంబర్ 20
- ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11
రాజస్థాన్
200 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
- నోటిఫికేషన్ నవంబర్ 12
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 19
- నామినేషన్ల పరిశీలన నవంబర్ 20
- నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 22
- ఎన్నికలు డిసెంబర్ 7
- ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11
By-polls in Shimoga, Bellary and Mandya in Karnataka to be held on 3rd November: Chief Election Commissioner OP Rawat pic.twitter.com/DdEud6UXMK
— ANI (@ANI) October 6, 2018