వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: బెంగాల్ ప్రచారానికి ఈసీ కత్తెర -రాత్రి 7వరకే అనుమతి -పోలింగ్‌కు 72 గంటల ముందే నిలిపేయాలి

|
Google Oneindia TeluguNews

మిగతా రాష్ట్రాల్లాగే ఎన్నికల రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లోనూ కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగాల్ లో తదుపరి దశల ఎన్నికల ప్రచారంపై కొత్త నిబంధనలు విధించింది. రాత్రి 7 గంటల వరకే ప్రచారానికి అనుమతి ఉంటుందని, పోలింగ్ కు 72 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంటుందని సవరించిన ఆదేశాలను జారీ చేసింది. ఇంతకు ముందు ప్రచార సమాప్తికి గడవు 48 గంటలు (2 రోజులు)కాగా, ఇప్పుడు దానిని 72 గంటలకు(మూడు రోజులకు) పెంచారు.

అచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువుఅచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువు

మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ లో ఇప్పటికే 4 దశల ఎన్నికలు పూర్తికాగా, శనివారం(ఈనెల 17న) ఐదో దశ పోలింగ్ జరుగనుంది. ఆ తర్వాత ఈనెల 29 వరకు మరో మూడు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా ఉధృతి నేపథ్యంలో చివరి మూడు దశల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను చర్చించేందుకు బెంగాల్ ఎన్నికల ప్రధాన అధికారి శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. భేటీ అనంతరం అధికారులు కొత్త నిబంధనలను జారీ చేశారు.

 ECs new rules for Bengal polls: No rallies after 7pm, silence period increased to 72 hrs

ఈసీ కొత్త నిబంధనలను శుక్రవారం నుంచే అమలులోకి వస్తాయని, శనివారం నుంచి ఉదయం 10 గంటలు- సాయంత్రం 7 గంటలలోపే పార్టీలు తమ ప్రచారాలను నిర్వహించుకోవాలని, పోలింగ్ కు 72 గంటల ముందే నిలిపేయాలని, వివిధ ప్రాంతాల్లో సభల్లో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్లు, నేతలు, అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించడంతోపాటు సభలో పాల్గొనే అందరూ మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడేలా, భౌతిక దూరం పాటించేలా నేతలే బాధ్యత వహించాలని ఈసీ నిబంధనల్లో పేర్కొంది. వీటిని ఉల్లంఘించిన నేతలు, పార్టీలపై చర్యలుంటాయని హెచ్చరించింది. కాగా,

ఎంపీ రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిల జాకెట్ చించడం తప్పు, మరి అమరావతి మహిళల సంగతేటి?ఎంపీ రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిల జాకెట్ చించడం తప్పు, మరి అమరావతి మహిళల సంగతేటి?

ఈసీ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో టీఎంసీ, బీజేపీలు భిన్నవాదనలు వినిపించాయి. మిగిలిన మూడు దశల ఎన్నికలను ఏకం చేసి, ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలని టీఎంసీ కోరింది. అందుకు ఈసీ నో చెప్పింది. బెంగాల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా ఈసీ మరింత శ్రద్ధ వహించాలని బీజేపీ సూచించింది.

English summary
Taking note of the prevailing Covid-19 situation, the Election Commission of India on Friday issued a set of new rules for campaigning for the remaining phases of the West Bengal Assembly election. Under the new rules, no political party will be allowed to hold any election rally between 7pm and 10am. This rule will be enforced with immediate effect, the poll panel said. Apart from this, the Election Commission has also increased the silence period for the upcoming phases to 72 hours from 48 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X