దేవభూమిలో ఓటర్లు ఎవరి వైపు - మోగిన ఎన్నికల నగారా : ధీమాతో ముందుకు..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో భాగంగా.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ పోల్స్ షెడ్యూల్ విడుదలైంది. 70 సీట్లు ఉన్న ఉత్తరాఖండ్ ప్రస్తుత శాసన సభ కాలపరిమితి ఈ ఏడాది మార్చి 23తో ముగియనుంది. తాజాగా ఎన్నికల సంఘం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఇతర రాష్ట్రాలతో పాటుగా ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జవనరి 21న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
జనవరి 31 నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు. 2017 ఎన్నికల్లో మొత్తం 70 సీట్లు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 57 సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో హరీష రావత్ రెండు సీట్ల నుంచి పోటీ చేసి ఒక సీట్లో ఓడిపోయారు. 2017 నుంచి ఈ నాలుగేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. త్రివేంద్ర సింగ్ రావత్ ను పదవి నుంచి తప్పించి , ఆ స్థానంలో మార్చి 10, 2021న తీర్ధ సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2017 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 11 సీట్లను గెలిచింది. ఈ సారి ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఈ సారి ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆప్ పార్టీ సైతం బరిలో ఉంది. ఇప్పటికే ప్రచారంలో నిలిచింది. ఇక, ఈ రాష్ట్రంలో ఎన్నికల కారణంగా ముందుగానే ప్రధాని అనేక డెవలప్ మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ గెలుపు పైన రెండు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications