inx medai case: చిదంబరం అరెస్ట్, ఇప్పుడు ఈడీ వంతు..
మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు సంబంధించి ఇవాళ ఉదయం తీహార్ జైలులో ఉన్న చిదంబరాన్ని ప్రశ్నించారు. చిదంబరంతోపాటు కార్తీ చిదంబరం, నళినిని కూడా అధికారులు విచారించారు. చిదంబరాన్ని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని, అవసరమైతే అరెస్ట్ చేసే వెసులుబాటు కల్పించాలని సీబీఐ కోర్టులో నిన్న ఈడీ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే.

ఇదీ అభియోగం
యూపీఏ హయాంలో ఐఎన్ఎక్స్ మీడియాకు దొడ్డిదారిన నిధులు మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఆర్థికమంత్రి పీ చిదంబరం ప్రోద్బలంతో అవకతవకలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జీ అప్రూవర్గా మారిన సంగతి తెలిసిందే. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా జైలు శిక్ష అనుభవించి.. బెయిల్పై బయట ఉన్నారు. ఈ కేసులో ఆగస్టు 21వ తేదీన పీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. ఆయన జ్యుడిషీయల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో ఈడీ అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పుడు ఈడీ
ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న చిదంబరాన్ని బుధవారం ఉదయం ప్రశ్నించింది. నగదు బదిలీపై ప్రశ్నించి.. అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది. గురువారం సీబీఐ ప్రత్యేక జడ్జీ అజయ్ కుమార్ కుహర్ వద్ద హాజరుపరుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరతామని పేర్కొన్నారు. కస్టడీకి తీసుకొని నగదు మళ్లింపులో జరిగిన అవకతవకలకు సంబంధించి ప్రశ్నిస్తామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.

కోర్టులో చుక్కెదురు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ను సవాల్ చేస్తూ చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అతను సాక్ష్యం మార్చలేడని.. కానీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తీహర్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు అతనికి ఇంటి ఆహారం ఇచ్చేందుకు మాత్రం హైకోర్టు అంగీకరించింది. ఇటీవల కడుపునొప్పి రావడంతో ఎయిమ్స్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే.

ఇది సరికాదు
2007లో జరిగిన కేటాయింపులకు సంబంధించి 2017లో కేసు నమోదు చేయడం ఏంటి అని చిదంబరం, అతని లాయర్లు కపిల్ సిబాల్ తదితరులు న్యాయస్థానంలో వాదిస్తున్నారు. సీబీఐ జ్యుడిషీయల్ కస్టడీ ముగియడంతో ఈడీ రంగంలోకి దిగింది. అరెస్ట్ చేసి మేజిస్ట్రెట్ ముందు హాజరుపరుస్తోంది. మొత్తానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసు చిదంబరాన్ని నీడలా వెంటాడుతుంది. తొలుత సీబీఐ, తర్వాత ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోన్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications