అధికార పార్టీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన అధికారులు, రిక్రూట్ మెంట్ లో అవకతవలు, మ్యాటర్ !
అధికార పార్టీకి చుక్కలు చూపించిన ప్రతిపక్ష పార్టీ ఓటర్లకు పలు ఉచిత పథకాలు ఎర చూపి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి అచ్చి ఆరు నెలలు పూర్తి అయిన సంతోషంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు కేంద్ర ప్రభుత్వ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, అవినీతి సొమ్మును సంపాధిస్తున్నారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.
కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా మలూరులో ఈడీ అధికారులు సోమవారం అవినీతిపరుల తలుపులు తట్టారు. మాలూరు ఎమ్మెల్యే కేవై నంజేగౌడ ఇంటిపై సోమవారం ఈడీ దాడులు చేసింది. కోలార్-చిక్కబళ్లాపూర్ జిల్లాల మిల్క్ యూనియన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నంజేగౌడ ఇంటిపై ఈరోజు తెల్లవారుజామున ఈడీ అధికారులు దాడులు చేశారు.

కోలారు జిల్లా మలూరు తాలూకా కొమ్మనహళ్లిలోని నంజేగౌడ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కోలారు తాలూకా హుత్తూరు సమీపంలోని ప్రాంతంలో ఎమ్మెల్యే నంజేగౌడకు చెందిన భవనంలో ఈడీ అధికారుు పలుపత్రాల పరిశీలిస్తున్నారు. ఇటీవల కోచిముల్ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కొమ్మనహళ్లి నంజుండేశ్వర్ స్టోన్ క్రషర్ ఫ్యాక్టరీలో పత్రాల పరిశీలన జరుగుతోంది.
కోచిముల్ రిక్రూట్మెంట్ విషయంలో ఎమ్మెల్యే నంజేగౌడ, ఆయన వర్గీయులు లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారుల దాడి జరిగినట్లు కన్నడ మీడియా సమాచారం. ఇచ్చింది. అయితే ఈ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నంజేగౌడ ఇంత వరకు స్పందించలేదు. మాలురు ఎమ్మెల్యే నంజేగౌడ బంధువులు, సన్నిహితుల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారని వార్తలు వచ్చినా అధికారాలు మాత్రం ఆ విషయంలో ఎలాంటి ప్రకటనలు చెయ్యలేదు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications